37.2 C
Hyderabad
April 26, 2024 21: 01 PM
Slider ఆదిలాబాద్

దేశానికి కొత్త దిశ చూపిస్తున్న మోడీ ముందు చూపు

#BJP Sirpur Kagajnagar

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆలోచన నుంచి వచ్చిన గరీబ్ కళ్యాణ్ యోజన దేశ పౌరులకు సామాజిక భద్రత, స్వావలంబన సాధన కోసం ఉపకరిస్తున్నదని బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణ బీజేపీ కార్యాలయంలో నేడు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

కరోనా కష్టాల సమయంలో ‘ఆత్మనిర్బర్ భారత్’తో దేశం నిశ్చయంగా ఈ కష్టాలను అధిగమిస్తుందని ఆయన అన్నారు. దేశం ఇప్పటికే ఆదర్శనీయమైన సహకారాత్మక సమాఖ్యతత్వాన్ని ప్రదర్శించిందని ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ప్రగతి సాధించామని ఆయన అన్నారు. భారీ మెజారిటీతో ప్రజాతీర్పు, వేగవంతమైన పరిపాలన, ప్రభుత్వ పథకాల ఫలాలు అట్టడుగు వ్యక్తి అందడం, విస్తృతమైన మౌలిక సదుపాయాల కల్పన చేశారని ఆయన అన్నారు.

దశాబ్ద కాలం నాటి సమస్యలకు సమర్ధ పరిష్కారం

దేశప్రగతికి ప్రతిబంధకాలుగా మారిన దశాబ్దాల కాలం నాటి సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం రాబోయే కాలంలో స్వయంసమృద్ధి, ఆర్థిక వృద్ధి బాటలో అప్రతిహతంగా దూసుకుపోతుందని అన్నారు

ఈ కార్యక్రమంలో సిర్పూర్ తాలూకా కన్వీనర్ కొంగ సత్యనారాయణ, మాజీ జిల్లా పరిషద్ చెర్మెన్ సిడం గణపతి, పట్టణ అధ్యక్షులు గోలెం , వీరభద్ర చారి, శరద్ శర్మ, మెడి కార్తిక్, గుంమ్ముల సాయి కృష్ణ, అరుణ్ దొంగరే, రాజశేఖర్, మాచర్ల శ్రీనివాస్, దిలీప్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

బోధనం

Satyam NEWS

పాలకవర్గం సహకారంతో హుజూర్ నగర్ పట్టణాభివృద్ధికి కృషి

Satyam NEWS

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

Bhavani

Leave a Comment