రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజనాభివృద్ధి శాఖా మంత్రి ఆర్కే రోజా నేడు టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డిని పరామర్శించారు. ఈఓ ధర్మరెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. వారి గ్రామమైన నంద్యాల జిల్లా పారుమంచాలకు వెళ్ళి మంత్రి ఆర్కే రోజా టిటిడి ఈఓ ఏవి.
ధర్మరెడ్డిని పరామర్శించారు. ఈఓ ధర్మరెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు మనో ధైర్యంతో ఉండాలని వారి కుటుంబ సభ్యులను మంత్రి కోరారు.