దేశం అత్యంత క్లిష్ట ఆర్ధిక పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రధాని పీవీ తన మేధస్సుతో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన గొప్ప సంస్కర్త అని విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శీను) అన్నారు.
తన క్యాంపు కార్యాలయంలో పీవీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ లో ఉమ్మడి రాష్ట్ర సీఎం గా , కేంద్ర మంత్రిగా పార్టీ జాతీయ అధ్యక్షుని గా చివరకు దేశ ప్రధానిగా ఇలా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చిన రాజకీయ చాణక్యునిగా దేశ ప్రజల ప్రశంసలు పొందారని మజ్జి శ్రీనివాసరావు అన్నారు.
ఇక ప్రస్తుత సీఎం జగన్… బ్రాహ్మణ సామాజిక సంక్షేమానికి ఎన లేని కృషి చేస్తూ అర్చకులకు సైతం ఆర్ధిక సహాయం అందచేస్తున్నారన్నారు. రాజకీయ వ్యవస్థలో కూడా ఈ వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తున్నా రని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అంతకుముందు మజ్జి శ్రీనివాసరావు… స్వర్గీయ పీవీ. చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్య క్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సి .హెచ్ .రవీంద్ర , గంగ రాజు , కె. సన్యాసి రాజు , వై . గోవింద రావు , డి .సంతోష్ , డి .వాసు , ఎన్. శ్రీనివాస్ , రాజు కామేశ్వరరావు, ఎం . రవి , ఎం .రవి , ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పేద బ్రాహ్మణ కుటుంబాలకు సమాఖ్య సభ్యులు నిత్యావసర సరకులు పంపిణీ చేసారు. అంతకు ముందు పీవీ శతజయంతి ఉత్సవం సందర్భంగా జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సేవ సంఘం అధ్యక్షులు కే.పి. ఈశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది పీవీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సేవ సంగ్ ఉపాధ్యక్షులు ఇనుగంటి రాకేష్ శర్మ , జిల్లా ఉపాధ్యక్షులు మోతడక మరళి .టి.వి.శ్రీనివాస్ , ద్వాదశి వేణు , కార్పొరేటర్ సుమతి మహిళా అధ్యక్షురాలు పప్పు సరోజిని లు పాల్గొన్నారు.