ఎంఎల్ సి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వెళ్తున్న సమయంలో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుసుమ రాజుకు నేడు అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కన్నీటి పర్యంతం అయ్యారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి కి చెందిన కుసుమ రాజు పార్టీ సమావేశానికి వచ్చి తిరుగు వెళుతున్న మరణించిన విషయం తెలిసిందే.
రాజు లేని లోటు పూడ్చలేమని ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ అన్నారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన తెలిపారు.
అంత్యక్రియలలో పాల్గొన్న ఆయన పాడే మోశారు. జిల్లా నాయకులు పోరిక గోవింద్ నాయక్,మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్,తుమ్మ సంజీవ రెడ్డి,
తుమ్మ మల్ల రెడ్డి,తహిర్ పాషా,సర్దార్ పాషాభోజరావు, చంద్రబాబు, కె.మహేష్,కె.చిన్ని,వ్.రాంబాబు,అల్లంల చంటి,భిక్ష పతి,ఎస్.రాంబాబు,కృష్ణ,రాంనర్సయ్య,ఇబ్రహీం,
వెంకన్న,లక్ష్మీ నారాయణ,శంకర్,వి.విశ్వేశ్వర, శ్రీనివాస్ రెడ్డి,వెంకన్న,టి.మోహన్, డి.సమ్మయ్య, పి.విజయ్,ఏ.రమేష్, కందకట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.