32.7 C
Hyderabad
April 27, 2024 00: 14 AM
Slider హైదరాబాద్

గ‌డీల పాల‌న బ‌ద్ద‌లు కొట్టాలంటూ ఇందిరా పార్క్ వ‌ద్ద పెద్ద ఎత్తున ధ‌ర్నా

#BJP Hyderabad

హైద‌రాబాద్ లోని ఇందిరాపార్క్ వ‌ద్ద బ‌డుగుల ఆత్మ గౌర‌వ పోరు స‌భ తో…బీజేపీ ఓబీసీ పెద్ద ఎత్తున ద‌ర్నా నిర్విహించింది.ఈ ధ‌ర్నాకు పార్టీ ప్ర‌తినిధుల‌తో పాటు ఓబీసీ మెర్చా జాతీయ అధ్య‌క్షులు,మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు కే.ల‌క్ష్మ‌ణ్ ముఖ్యఅతిథిగా హజ‌రయ్యారు.

ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ జాతీయ వైద్య విద్యా సంస్థల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఏటా 5,500 మందికి లబ్ది చేకూరుతుందన్నారు  మోడీ కేబినెట్ లో 35 శాతం బీసీలకు స్థానం దక్కిందని…. ఏకంగా 27 మంది ఓబీసీలకు,  10 మంది గిరిజనులకు, 11 మంది మహిళలకు స్థానం కల్పించారని….10 మంది మహిళలు వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా కొనసాగిస్తున్నార‌ని ల‌క్ష్మ‌ణ్ గుర్తు చేసారు.సామాజిక న్యాయం అంటే ఇదే అని ల‌క్ష్మ‌ణ్ కేసీఆర్ ప్ర‌భుత్వ విధానాల‌పై ప‌రోక్షంగా మాట్లాడారు..

ఇక  బీసీ నేత అయిన మోడీని  ప్రధానిమంత్రిగా పార్టీ చేసింద‌ని…ఇక‌. దళితుడు రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేన‌ని ల‌క్ష్మ‌ణ్ గుర్తు చేసారు.కానీ కేసీఆర్ మాత్రం ఎస్సీ,ఎస్టీ, బీసీలను మోసం చేస్తూ రాజకీయ లబ్ది పొందుతున్నాడ‌ని ఆరోపించారు?దళితుడు, గిరిజనులను సీఎం చేసే దమ్ము కేసీఆర్ ఉందా అంటూ  ప్ర‌శ్నించారు.సీఎం కాదు కదా….కనీసం పార్టీ అధ్యక్షుడిని కూడా చేయలేని వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.

90 శాతం బడుగు, బలహీనవర్గాల జనాభా ఉన్న తెలంగాణలో పెత్తందారీ, బూర్జువా వ్యక్తి సీఎంగా కొనసాగుతుండటం మన దౌర్భాగ్యమ‌న్నారు.సీఎం కేసీఆర్ పిలిచి భోజనాలు పెట్టారంటే….ఆరోజే దళిత, గిరిజనుల సంక్షేమం గురించి మర్చిపోవాల్సిందేన‌ని కల్వకుంట్ల కుటుంబం కోసమే తెలంగాణ సంపదను కేసీఆర్ దోచుకుతింటున్నారంటూ ల‌క్ష్మ‌ణ్ తీవ్ర  స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

గడీల పాలనను బద్దలు కొట్టడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయని..స్ప‌ష్టం చేసారు.

Related posts

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే

Satyam NEWS

సైనికులతో దీపావళి వేడుకలు

Murali Krishna

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Bhavani

Leave a Comment