29.7 C
Hyderabad
May 2, 2024 05: 21 AM
Slider సినిమా

మహోన్నత వ్యక్తి, నటుడు చిత్తూరు నాగయ్య

తొలితరం నటుడుగా, నిర్మాత గా, గాయకుడు గానే కాకుండా పలువురు ప్రముఖుల చే నీరాజనాలు అందుకున్న మహోన్నత వ్యక్తి చిత్తూరు నాగయ్య అని తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్త అన్నారు

గురువారం ఉదయం హైదరాబాద్ నాగోల్ లోని ఆయన క్యాంప్ కార్యాలయం లో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్తూరు నాగయ్య 119వ జయంతి ఉత్సవం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శతాబ్ద కాలం నాటి నటులను వారి సేవలను గుర్తు పెట్టుకొని జయంతి సభ నిర్వహించడం ద్వారా అలాంటి మహానుభావుల సేవలు ఇప్పటి తరానికి తెలుస్తుంది అన్నారు.

నాగయ్య నటుడు గా త్యాగయ్య గా, పోతన గా జీవించారాన్నరు. దక్షిణ భారత దేశంలో పద్మశ్రీ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు కావడం తెలుగు వారి గా మనందరికీ గర్వ కారణం అన్నారు. ప్రముఖ సినీ విశ్లేషకులు ఎస్.వి.రామారావు నాగయ్య జీవిత విశేషాలను వివరించారు. ఆయన ఎంత గొప్ప నటుడో అంత గొప్ప గాయకుడు అన్నారు.

కర్ణాటక, హిందు స్థానిక సంగీతాన్ని ఆయన గొప్ప ప్రతిభాశాలి అన్నారు. అలనాటి గృహలక్ష్మి చిత్రం కోసం ఆయన పాడిన సందేశాత్మక గీతం ‘కల్లు మానండోయి బాబు కళ్ళు తెరవండోయి ‘ అనే పాట ఇప్పటికీ తెలుగు వారికి సుపరిచితం అన్నారు.. కార్యక్రమానికి ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో IVF స్టేట్ మీడియా కమిటీ చైర్మన్ గంగిశెట్టి రఘు, డా.చైతన్య, వేముల అనిల్ ఆకృతి సుధాకర్, అభ్యుదయ కళా సమితి భాస్కరశర్మ, నటులు జి. వెంకటేశ్వర్లు తో పాటు పలువురు కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వాగులో చిక్కుకున్న అన్నదాత

Satyam NEWS

సైబర్ మోసం.. ఇద్దరి వద్ద 73 వేలు మాయం

Satyam NEWS

విద్యా, వ్య‌వ‌సాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద‌పీట‌

Sub Editor

Leave a Comment