29.7 C
Hyderabad
May 6, 2024 04: 59 AM
Slider మహబూబ్ నగర్

జ్యోతిబాపూలే కు మాజీ మంత్రి జూపల్లి ఘన నివాళి

jupally 111

సమాజంలో సామాజిక అంతరాలను నిర్మూలించడానికి జీవితకాలం పోరాటం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే 193 జయంతిని పురస్కరించుకుని ఈరోజు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నంబాయి మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని మంచి నీటితో శుభ్ర పరిచి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు.

భారత దేశంలో శూద్ర అతిశూద్ర వర్గాలకు విద్యను నిరాకరించిన  పరిస్థితుల్లో మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు వర్గాలకు విద్యను అందించారని ఈ సందర్భంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

దీనితో బాటు తన భార్య సావిత్రిబాయి పూలే ద్వారా మహిళలకు విద్యను అందించారని ఆయన తెలిపారు. అదేవిధంగా మానవ హక్కుల కోసం, బాలల హక్కుల కోసం, ఎన్నో పోరాటాలు చేశారని పూలే ను మాజీ మంత్రి కొనియాడారు.

భారతదేశంలో తొలి కార్మికోద్యమాలు,యూనియన్ లు ఏర్పాటు చేసిన  కార్మిక ఉద్యమ నాయకుడని అలాంటి నాయకుని ఆశయాలను ముందుకు తీసుకపోవలసిన అవసరం ఎంతో ఉందని ఆయన చెప్పారు.

Related posts

కొడంగల్ లో ఆటో యూనియన్ ఆత్మీయ సమ్మేళనం

Satyam NEWS

వైద్య సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన డాక్టర్ కరుణాకర్

Satyam NEWS

రజాకార్ల పాలన గుర్తుకు తెస్తున్న కేసీఆర్

Satyam NEWS

Leave a Comment