తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ కు ఘనంగా నివాళులర్పించారు. గద్వాల జిల్లా కేంద్రం రాజీవ్ మార్గ్ శృతి వనంలోని అమరవీరుల స్తూపం వద్ద గురువారం గద్వాల జిల్లా తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ఖబీర్దాస్ నర్సింహులు ఆధ్వర్యంలో మత్స్యకారుల సంఘం నాయకులతో పాటు కుల బంధువులు కలిసి తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కబీర్ దాస్ నర్శింహులు మాట్లాడుతూ కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని ప్రభుత్వంమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.కిష్టయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన త్యాగం తెలంగాణ రాష్ట్రచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి జనార్దన్, గద్వాల తాలూకా అధ్యక్షులు TNR జగదీష్, యువజన జిల్లా అధ్యక్షులు అడ్వాకేట్ పాండు,గద్వాల పట్టణ అధ్యక్షులు వంట భాస్కర్, గద్వాల తాలూకా యువజన అధ్యక్షులు చిరు,గద్వాల పట్టణ యువజన అధ్యక్షులు రఘు,కులబంధువులు తదితరులు పాల్గొన్నారు.