సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని TRS పార్టీ కార్యాలయంలో MLA శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నాయకులు మాట్లాడుతూ తెలంగాణ పోరాటానికి స్పూర్తినిచ్చి, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ భావి తరాలకు స్పూర్తి ప్రధాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో TRS పార్టీ పట్టణ అధ్యక్షులు అమరనాధ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, ఉపాధ్యక్షులు బుచ్చిబాబు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, MPP గుడెపు శ్రీను, కౌన్సిలర్ కుంట ఉపేంద్ర TRS నాయకులు జక్కుల వెంకయ్య, KLN రెడ్డి, నర్సింగ్ వెంకటేశ్వర్లు , కడియాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.