సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పురస్కరించుకుని మూతవేసిన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని తెరిచారు. ఆదివారం మధ్యాహ్నం సూర్య గ్రహణం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని గోదావరి జలాలతో సంప్రోక్షణ నిర్వహించారు.
ఆలయంలోని అమ్మవార్లకు అభిషేక అర్చన పూజ నిర్వహించి భక్తులకు దర్శనం సేవలు కొనసాగించారు. కోవిడ్ నిబంధనల మేరకు భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసిన లోనికి అనుమతించారు.
భక్తుల చేతులకు శానిటైజర్ ఇచ్చిన అనంతరం మాత్రమే ఆలయంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సర్వాలంకార భూషితమైన అమ్మవారి రూపాన్ని దర్శించుకుని భక్తులు తరించారు.