ములుగు జిల్లా ములుగు మండలం పత్తిపెల్లి గ్రామంలో ఇటీవల మరణించిన మాజీ సర్పంచ్ నునావత్ సారయ్య నాయక్ సోదరుడు పత్తిపెల్లి MPTC నునావత్ మహేష్ ను TRS పార్టీ ములుగు జిల్లా నాయకుడు గండ్రకోట సుధీర్ నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ సారయ్య నాయక్ ప్రజల మనిషి అని నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే వారు అన్నారు.
తెలంగాణ ఉద్యమం మొదలు కొని, గ్రామ సర్పంచ్ గా, సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితుడు సారయ్య నాయక్ తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని తలచుకున్నారు. సారన్న అకాల మరణం పార్టీకి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అన్నారు. సారన్న కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుకున్నారు. సారన్న భౌతికంగా దూరమైన తన ఆశయాలను బడుగు,బలహీన వర్గాల కోసం ముందుకు తీసుకుపోతామని అన్నారు.
అలాగే జంగాలపెల్లి గ్రామంలో మరణించిన యువజన విభాగం గ్రామ అధ్యక్షులు చింతల కిషోర్ తండ్రి చింతల సాంబయ్య కుటుంబాన్ని, ములుగు పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి మొండయ్య కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జన్నారపు శ్రీను, ములుగు టౌన్ అధ్యక్షులు చెన్న విజయ్, Ex MPP మురళి, తెరాసా పార్టీ నాయకులు రాజా హుస్సేన్, చిట్టి బాబు,PACS vice Chairman సాంబయ్య, యువజన విభాగం నాయకులు కోగీల మహేష్, ఎనగందుల వెంకటేష్, సోమ వంశీ తదితరులు పాల్గొన్నారు.