సత్యం న్యూస్.నెట్ కు ప్రత్యేకంగా….!
విజయనగరం జిల్లాలో తుపాను ప్రబావంపై జిల్లా రెవిన్యూ అధికారి గణపతిరావు స్పందించారు.జాతీయ వాతావరణ విపత్తు నివారణ కేంద్రం సూచనల మేరకు అలాగే విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలతో తుపాను ప్రబావంపై అప్రమత్తంగా ఉన్నమని…సత్యం న్యూస్.నెట్ కు చెప్పారు..రాగల అతి కొద్ది గంటలలో జిల్లాలో ఉరుములు,మెరుపులతో వర్షాలు పడతాయన్నారు.అలాగే సముద్ర తీరప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. తీర ప్రాంతాలతో పాటు దానికి అనుకుని ఉన్న మండల రెవిన్యూ అధికారుల నుంచీఎప్పటికప్పుడు సమాచారం తలుసుకుని అందుకు తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే యత్నాలలో జిల్లా యంత్రాగం మొత్తం సిద్దంగా ఉందన్నారు…డీఆర్ఓ.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం