కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నుంచి బిజెపికి వలసలు ప్రారంభం అయ్యాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బావు తిరుపతి యాదవ్ నేడు బిజెపిలో చేరారు.
ఈ రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ సమక్షంలో ఆయన బిజెపిలో చేరారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో జిల్లా ఓబిసి మోర్చా జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ యాదవ్, హుజురాబాద్ టౌన్ ఉపాధ్యక్షులు నాంపల్లి సుమన్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు నర్రా శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.