కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ లో రోడ్ వైడనింగ్ పేరుతో ప్రజలను వై.సి.పి నాయకులు లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆరోపించారు. ప్రజలకు నష్టపరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వై.సి.పి నాయకులు దోచేస్తున్నారని ఆమె అన్నారు. రోడ్డు వెడల్పు పనులకు సంబంధించి ఎమ్మెల్యే డబ్బుల వసూలుపై జిల్లా కలెక్టర్ విచారణకు రావాలని ఆమె కోరారు.
అవినీతి జరిగిందని నిజం నిరూపించకపోతే నేను రాజకీయలకు రాజీనామా చేసే ధైర్యం నాకు ఉంది. నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసే దమ్ము నీకుందా? అని ఆమె ఎమ్మెల్యేను ప్రశ్నించారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేపర్ మీద సంతకం పెట్టి కలెక్టర్ కు ఇస్తా నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు అవినీతికి పాల్పడలేదనే ధైర్యం నీకు ఉంటే రాజీనామా పత్రం తీసుకుని కలెక్టర్ ముందుకు వచ్చే ధైర్యం వుందా? అని అఖిల ప్రియ అన్నారు. ఆళ్ళగడ్డలో ఎప్పుడూ లేనివిధంగా నీచమైన డబ్బు రాజకీయాన్ని పరిచయం చేస్తున్నారని ఆమె అన్నారు.