40.2 C
Hyderabad
April 28, 2024 18: 11 PM
Slider జాతీయం

బులంద్ షహర్ లో ఇద్దరు పోలీసుల్ని చంపిన రైతు ట్రక్కు

#Bulandsharar

రైతులకు అన్యాయం జరుగుతున్నదని గగ్గోలు పెడుతున్న ఒక వర్గం మీడియా బందోబస్తులో ఉన్న పోలీసులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు.

పైగా పోలీసులదే తప్పన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. మంగళవారంనాడు ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు పోలీసులను రైతు సంఘాల వారు ట్రక్కు తో ఢీ కొట్టి చంపేసిన సంఘటనను ఒక వర్గం మీడియా వక్రీకరించి చూపిస్తున్నది.

పోలీసులే ప్రమాదవశాత్తూ చనిపోయారని జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదని ఉత్తరప్రదేశ్ పోలీసులు అంటున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో మంగళవారంనాడు రైతు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను అడ్డుకోవడానికి పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఆ బ్యారికేడ్లను తోసుకుంటూ ట్రక్కును నడపడంతో అక్కడే ఉన్న ఇద్దరు పోలీసులు మరణించారు. ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

సికంద్రా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు.

Related posts

కరెంటు చార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు

Satyam NEWS

చీఫ్ జస్టిస్ సంచలన నిర్ణయం

Satyam NEWS

ఏపీ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి  సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment