తెలంగాణ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. కార్మికులు ఎవరు భయపడవొద్దని ఆయన కోరారు. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయివేటీకరణ సాధ్యం కాదని ఆయన అన్నారు. చట్టంలో ప్రయివేటికరణ ప్రసక్తే లేదని ఆయన వివరించారు. రేపు ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటాలకు నివాళి అర్పించి డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా ఎంజీబిఎస్ లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమీక్షలో మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ జెఏసి జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని ఆయన తెలిపారు.
previous post