తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టియస్ యుటిఎఫ్) కొల్లాపూర్ మండల మహాసభ కొల్లాపూర్ లో నిర్వహించారు. కొల్లాపూర్ పట్టణంలోని PS రాజవీధి లో TSUTF జిల్లా కార్యదర్శులు బడుగుల నారాయణ, చంద్రశేఖర్, జిల్లా సీనియర్ నాయకులు మహమ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాలపై విస్తృతంగా చర్చించారు.
అనంతరం ఈ మహాసభలో కొల్లాపూర్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ వివరాలు: గౌరవ అధ్యక్షులు: MD ఖుర్భాన్ అలీ, గౌరవ ప్రధాన సలహాదారు: MDమహమ్మద్, అధ్యక్షులు: కె.శంకర్, ప్రధాన కార్యదర్శి: యం.మధు, ఉపాధ్యక్షులు: MD రబ్బాని పాషా, ఉపాధ్యక్షురాలు గా భారతి, సరస్వతి, కోశాధికారి: యం.చంద్రశేఖర్, కార్యదర్శులు గాMD గఫూర్, యం.నారాయణ, వేణుమాధవ్ గౌడు, ఆడిట్ కమిటీ కన్వీనర్: మహమ్మద్ సలీం, ఉపాధ్యాయ పత్రిక బాధ్యులు: వెంకటరమణ ఎన్నికయ్యారు.
సభ్యులుగా1) చందర్,2) గణేష్, 3) మహమ్మద్ రహమాన్,4) దాసు, 5) రమణి, 6) ఫర్జానా బేగం, 7) జ్యోత్స్న, 8) శారద, 9) వర ప్రసాద్,10) బాంగారయ్య ఉన్నారు.