ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తుమ్మల వెంట ఆయన కుమారుడు యుగంధర్, ప్రధాన అనుచరులు సాదు రమేష్ రెడ్డి మాత్రమే వున్నారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ద రామయ్య, కర్ణాటక నేత డి కే శివకుమార్, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాణిక్ రావ్ టాక్రె తదితరులు వున్నారు