32.2 C
Hyderabad
May 1, 2024 23: 55 PM
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టులలో బలమైన శక్తిగా మారిన ఐజేయూ

IJU

మీడియా స్వేచ్ఛను పరిరక్షిస్తూనే, జర్నలిస్టుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) దేశంలో బలమైన శక్తిగా నిలిచిందని టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. నేడు షోలాపూర్ లో జరిగిన మహారాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(MSUWJ) షోలాపూర్ జిల్లా యూనియన్ ముఖ్యుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉండి, దేశవ్యాప్తంగా వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని చూరగొన్న ఘనత కేవలం ఐజేయూకు మాత్రమే దక్కిందని విరాహత్ అలీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో MSUWJ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గుందారి, దాయనంద్ మామ్డల్, టీయుడబ్ల్యుజె నాయకులు ఏ.రాజేష్ లతో పాటు షోలాపూర్ సీనియర్ జర్నలిస్టులు పలువురు పాల్గొన్నారు.

Related posts

హైజంప్ పోటీలో ప్రథమ స్థానం సంపాదించిన మోదాల పరమేష్ కు అభినందన

Satyam NEWS

రెడ్డి సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరణ

Bhavani

మీడియా పేరు చెప్పాడు… దోపిడి చేస్తున్నాడు

Satyam NEWS

Leave a Comment