సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఈనెల 27న జరిగే బి.ఆర్.ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గం ప్రగతి నివేదిక సభ నిర్వహిస్తున్నట్లు తిరుమలగిరి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు మునిసిపల్ వైస్ చైర్మన్ సంకె పెళ్లి రఘునందన్ రెడ్డి తెలిపారు, శుక్రవారం నాడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని
అనవారే కారణాలవల్ల తుంగతుర్తి ప్రగతి నివేదిక సభ 26న నిర్వహించాలని అనుకున్నాం కానీ , కొన్ని అనవార్య కారణాల వల్ల, ఈనెల,27న బహిరంగ సభను సూర్యాపేట ఎక్స్ రోడ్డు దగ్గరలో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ,టిఆర్ఎస్ బహిరంగ సభకు రాష్ట్ర ఐటీ ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా సభకు హాజరవుతున్నారని ఉమ్మడి
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ హాజరవుతున్నారని తెలిపారు,9 మండల కేంద్రాల్లో ఉన్న టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ,
ఈ కార్యక్రమంలో, ఎంపీపీ నెహ్రూ కొమ్ముల స్నేహలత, 8వ వార్డ్ కౌన్సిలర్ ,శాగంటి అనసూయ రాములు, కౌన్సిలర్ బత్తుల శ్రీనివాస్, 14 వ వార్డు ఇంచార్జ్ మహేశ్వర సందీప్ నేత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.