39.2 C
Hyderabad
May 3, 2024 14: 59 PM
Slider నల్గొండ

దొరల పాలనలో దగాపడ్డ తెలంగాణలో రానున్నది రాజన్న రాజ్యమే

#aderla

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

దొరల పాలనలో దగాపడ్డ తెలంగాణ రాష్ట్రంలో రేపు రానున్నది రాజన్న రాజ్యమే అని హుజూర్ నగర్ నియోజకవర్గ వైయస్సార్ తెలంగాణ పార్టీ కో- ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గ వైయస్సార్ తెలంగాణ పార్టీ కో-ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి సమక్షంలో మేళ్ళచెరువు, మఠంపల్లి మండలాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు.

మేళ్ళచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన అంచూరి పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో గాయం పుల్లారెడ్డి, అంచూరి జనార్దన్ రెడ్డి, కంజుల లక్ష్మారెడ్డి,ఉలవల పూడి జగన్,చాట్ల శ్రీహరి,షేక్ జానీమియా, మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామానికి చెందిన విశ్రాంత రెవెన్యూ అధికారి ఉద్దగిరి శామ్యూల్ జాన్ ఆధ్వర్యంలో కృష్ణ తండాకు చెందిన నరేందర్ బానోతు,భూక్య సాయినాథ్ భూక్య గోపి తదితర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఆదెర్ల శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆదెర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలు దొరల పాలనలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తాను ప్రకటించిన ఏ ఒక్క పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదని అన్నారు.

ఇళ్ళు లేని నిరుపేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఊసే లేదని, చదువుకొని ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత తమ తనువులు చాలిస్తున్నారని అన్నారు. రైతులకు రైతుబంధు పూర్తి స్థాయిలో అందడం లేదని,వికలాంగుల,వృద్ధాప్య, వితంతువుల పెన్షన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి,భూమి కలిగి ఇల్లు నిర్మించుకునే వారికి మూడు లక్షల రూపాయలు ఇస్తానన్న హామీలు ఎవరికి అందాయని ప్రశ్నించారు.బంగారు తెలంగాణ చేసి చూపెడతా అన్న కెసిఆర్ బాధల తెలంగాణ చేశారని,సంపన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. ఈ దుస్థితి మారాలంటే ప్రతి ఒక్కరూ వైయస్ షర్మిల నాయకత్వంలో ఏర్పాటైన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో సంక్షేమం,సమానత్వం స్వయం సమృద్ధి సాధనే లక్ష్యంగా, రాజన్న సంక్షేమ పాలన ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తనయ వైయస్ షర్మిల మన ముందుకు వస్తున్నారని వారికి మనమంతా చేయూతనిచ్చి ఆశీర్వదించి వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ గ్రామ గ్రామాన వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడేల కృషిచేయాలని కోరారు. భవిష్యత్ తరాల బతుకుల కోసం తెలంగాణలో రేపు రానున్నది రాజన్న రాజ్యమే అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

జగన్ మంత్రి వర్గం ఫైనల్ లిస్టు విడుదల

Satyam NEWS

అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలు: భక్తుల ఆగ్రహం

Satyam NEWS

మంకు పట్టువీడని జగన్: పంచాయితీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు

Satyam NEWS

Leave a Comment