ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అప్పాయింట్ మెంట్ ఇవ్వని కేంద్ర హోం మంత్ర అమిత్ షా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు, ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతున్న రఘురామ కృష్ణంరాజుకు ఇవ్వడం ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నది.
అధికారికంగా ఇంకా ఈ వార్త ఖరారు కాలేదు కానీ ఢిల్లీ లో ఉన్న మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకున్న వైసిపి ముఖ్యలు జరగబోయే పరిణామాల పై ఆందోళన గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, బిజెపి నాయకులపై ఒంటికాలితో లేచే వైసీపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి రఘు రామకృష్ణం రాజుకు సంబంధించి గట్టి కౌంటర్ ఇవ్వకపోవడం కూడా వైసీపీ వర్గాలను కలవరపరుస్తున్నది.
వై ఎస్ జగన్ ఏడాది పాలనలో స్యాండ్, ల్యాండ్, వైన్ మాఫియా తో సహా కుల రాజకీయాలను ఎండగట్టిన ఆయన ఈ సారి పార్టీకి భారీ షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనికి ప్రధాన కారణం సొంత కులానికి చెందిన నేతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పొమ్మన లేక పొగబెడుతుంది అనే ఆలోచనకు రఘు వచ్చారని ఆయన సన్నిహితులు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న రాజకీయానికి ధీటైన జవాబు ఇవ్వాలని రఘు భావిస్తున్నారు. అందుకే ఆయన అమిత్ షాను కలవబోతున్నట్లుగా చెబుతున్నారు.