29.7 C
Hyderabad
May 4, 2024 03: 41 AM
Slider కరీంనగర్

చెట్టు కూలి ప్రమాదం: ఇద్దరి మృతి

#nirmal

భారీ వర్షానికి నిర్మల్‌ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకులు కుంటాల జలపాతం వద్దకు టాటాఏస్‌ వాహనంలో వెళ్తుండగా ఒక్కసారిగా భారీ వృక్షం విరిగి పడింది. దాంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఖానాపూర్‌ మండలం ఎగ్బాల్‌పూర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భుచ్చన్న, రవి అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. నిఖిల్‌ను తొలుత ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. గత రాత్రి నుంచి నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Related posts

చిన్న జియర్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి

Satyam NEWS

పీస్ ఫుల్: ప్రశాంతంగా ముగిసిన పుర ఎన్నికలు

Satyam NEWS

ప్రశ్నించే వారిపై కేసులా..

Bhavani

Leave a Comment