రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్ర ధన గ్రామానికి చెందిన బైండ్ల శివ తన చెల్లెలు శివ లీలల తల్లిదండ్రులు చనిపోవడంతో వారు అనాథలుగా మిగిలిపోయారు. తల్లిదండ్రులు కోల్పోవడంతో కటిక పేదరికం లో ఉన్న వారు పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు.
వారి దయనీయ పరిస్థితిని చూసి చెలించిన ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ వారికి పక్కా ఇల్లు కట్టిస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రధన సింగిల్ విండో డైరెక్టర్ బండెల రఘువర్ధన్ రెడ్డి, నాయకులు బక్కి రఘు, శంకర్ రెడ్డి, పాపయ్య, జంగిలి , తదితరులు పాల్గొన్నారు.