33.7 C
Hyderabad
April 29, 2024 02: 18 AM
Slider ముఖ్యంశాలు

కోర్టు ధిక్కారం: ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

#APHighCourt

తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా ధిక్కరించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది.

చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ లు తాము ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయలేదని కోర్టు నిర్ధారణకు వచ్చింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీ హైకోర్టు ఏప్రిల్‍లో ఆదేశాలు ఇచ్చింది.

అప్పటి వారు కోర్టు ఆదేశాలను పాటించలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం సిబ్బందిని రెగ్యులరైజ్ చేయలేదు.

దాంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ లకు వారం రోజులు జైలు శిక్ష విధించింది.

Related posts

రాష్ట్ర స్థాయి అథ్లెంటిక్స్ కు సిఆర్‌పిఎఫ్‌ విద్యార్థులు

Satyam NEWS

నేటి వరకూ 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Bhavani

హెవెన్లీ ఎఫైర్: హీరో నితిన్ పెళ్లి పనులు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment