తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా ధిక్కరించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది.
చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ లు తాము ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయలేదని కోర్టు నిర్ధారణకు వచ్చింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీ హైకోర్టు ఏప్రిల్లో ఆదేశాలు ఇచ్చింది.
అప్పటి వారు కోర్టు ఆదేశాలను పాటించలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం సిబ్బందిని రెగ్యులరైజ్ చేయలేదు.
దాంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది.
ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ లకు వారం రోజులు జైలు శిక్ష విధించింది.