వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్ గ్రామానికి చెందిన అంజమ్మ అనే మహిళకు పదేళ్ల క్రితం చెన్ గేస్ పూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే అంజమ్మకు అగ్గనూర్ గ్రామానికి చెందిన బైండ్ల నర్సింలుతో అక్రమ సంబంధం ఉంది. ఏ కారణం వల్లో ఇటీవల వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.
గురువారం రాత్రి గ్రామానికి వచ్చిన అంజమ్మతో నర్సింలు గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన నర్సింలు తన వెంట తీసుకువచ్చిన డీజిల్ ను అంజమ్మపై పోసి నిప్పంటించాడు. ఆపై తనపై కూడా డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. జరిగిన హఠాత్పరిణామానికి అంజమ్మ తల్లిదండ్రులు తేరుకుని వాళ్లని ఆర్పే ప్రయత్నం చేయగా వారి ఇరువురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్ర గాయాలైన వారిని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా కు తరలించగా వారు ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ ఇరువురు మృతి చెందారు. ఆర్పే ప్రయత్నంలో తీవ్ర గాయాలైన అంజమ్మ తల్లిదండ్రులు కాండలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు యాలాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.