39.2 C
Hyderabad
May 3, 2024 14: 49 PM
Slider వరంగల్

ఈ దౌర్భాగ్యులిద్దరికి ఏం శిక్ష వేయాలో మీరే చెప్పండి

ACP Warangal

వాడేం తండ్రో అర్ధం కాదు. తండ్రి తర్వాత తండ్రిలా చూసుకోవాల్సిన మేనమామ మరొక దౌర్భాగ్యుడు. ఈ ఇద్దరూ ఏం చేశారో రాయాలంటేనే చిరాకుగా ఉంది. ఇక వాళ్లు ఆ పని ఎలా చేశారో అర్ధం కావడం లేదు. ఈ పరమ నీచులు ఇద్దరూ చిన్న పిల్లలపై అత్యాచారం చేశారు. దౌర్భాగ్యం ఏమిటంటే ఆ పిల్ల వాడి కూతురు.

వీడికి మేనకోడలు. వరంగల్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వరంగల్ కాశీబుగ్గ వివేకనంద కాలనీలో నివాసం ఉంటున్న గడ్డం రాజు, సరిత లకు ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో సరిత ఆనందపడింది. మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించే వాడు.

ఇద్దరు కుమార్తెల్లో ఒకరు దివ్యాంగురాలు. ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ  పాఠశాలలో చదువుకుంటారు. దివ్వాంగురాలైన కుమార్తెపై మేనమామ కన్నేశాడు. మరో కూతురిపై తండ్రి కన్నేశాడు. ఈ దరిద్రులు ఇద్దరూ ఏడాదిగా ఈ దుర్మార్గపు పని చేస్తున్నారు. ఎవరికి చెప్పాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న చిన్నారులకు పాఠశాల అధ్యాపకులు సాయం అందించారు. స్థానిక ఇంతజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రంగంలో దిగిన పోలీసులు తండ్రిని, మేనమామను అదుపులో తీసుకోని అత్యాచారం, ఫోక్సో కేసు నమోదు చేశారు. వీరిద్దరిని రిమాండ్ కు తరలిస్తున్నామని  ఏసీపీ జితేందర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.

Related posts

Hot Topic: కొల్లాపూర్ పాలిటిక్స్: ఇటు సీఎం…అటు జూపల్లి

Satyam NEWS

ఎన్టీఆర్‌తో నటించాలన్న కోరిక అలా తీరింది

Bhavani

పోలీసుల అదుపులో మావోయిస్ట్ అ్రగనేత భార్య

Satyam NEWS

Leave a Comment