30.7 C
Hyderabad
April 29, 2024 06: 02 AM
Slider కడప

ఇంత అర్జెంటుగా స్థానిక సంస్థల ఎన్నికలు అవసరమా?

sailajanath

ఇంత అర్జెంటుగా స్థానిక సంస్థల ఎలక్షన్ లు జరపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. కడప నగరంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.

ఇవే ఎలక్షన్లు మూడు నెలలు ముందు పెట్టుకుని ఉంటే ఎవరైనా వద్దన్నా రా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్ లో పోటీ చేస్తుందని ,అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నామన్నారు. వైసీపీ మంత్రులకి, ఎస్పీలకు 90% గెలిపించే బాధ్యత ఇచ్చారని దాన్ని అర్థం చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బు, మద్యం పైన వైసీపీ ప్రభుత్వం మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు.

ప్రలోభాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ వాళ్ళు కట్టుబాట్లు దాటితే జగన్మోహన్‌రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలన్నారు.

Related posts

రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో గోపన్పల్లి విద్యార్థిని

Satyam NEWS

కొల్లాపూర్ రాజాను సవాల్ చేస్తూ బైఠాయించిన మాజీ మంత్రి

Satyam NEWS

తెదేపా బీసీ నాయకుల పై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు

Satyam NEWS

Leave a Comment