42.2 C
Hyderabad
April 30, 2024 18: 27 PM
Slider ఆధ్యాత్మికం

శంభులింగేశ్వర స్వామి సన్నిధిలో ఉదయగిరి ఎమ్మెల్యే

#Mellacheruvu Temple

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరి శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  దంపతులు పూజలు నిర్వహించారు.

ఆయన తో బాటు చేజర్ల చలమా రెడ్డి దంపతులు కూడా శంభు లింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ అత్యంత పురాతనమైన శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, వారి సోదరులు 6 లక్షలు రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆలయ చైర్మన్ భోగాల కొండారెడ్డి   మాట్లాడుతూ ఎమ్మెల్యే  ఆలయాన్ని సందర్శించడం,ఆలయ చరిత్ర తెలిసికొని వారి దాతృత్వం చాటటం  చాలా సంతోషంగా ఉందని అన్నారు.

వారు ప్రకటించిన విరాళాన్ని ఆలయ ముఖద్వారానికి వెండి తొడుగులు కొరకు వినియోగిస్తామని, ఆలయ అభివృద్ధి కొరకు తమవంతుగా సహాయం చేసిన ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో మండల కార్మికశాఖ అధ్యక్షులు సాముల వెంకట్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వినాయక మండపాలకు అనుమతి నిరాకరణ పై భజరంగ్ దళ్ నిరసన

Satyam NEWS

తొర్రూరులో రూ.152 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు

Satyam NEWS

అమృత్ ఉద్యాన్ గా మొఘల్ గార్డెన్స్

Murali Krishna

Leave a Comment