కేంద్ర ప్రభుత్వం మొఘల్ గార్డెన్స్ పేరు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రఖ్యాత ఉద్యానవనం పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చింది. 75 వసంతాల స్వతంత్ర భారతావనిని దృష్టిలో ఉంచుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యాచరణను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చినట్టు తెలుస్తోంది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇకపై సరికొత్త నామపేరు తో కొనసాగనున్న ఈ ఉద్యానవనాన్ని ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. కాగా ప్రజల సందర్శన నిమిత్తం ఈ అమృత్ ఉద్యాన్ ను జనవరి 31 నుంచి మార్చి 26 వరకు తెరిచి ఉంచుతారు.
previous post