ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఆడపిల్లలకు మరొక సారి అవమానం జరిగింది. ఇప్పటికే భుజ్ లోని ఒక హాస్టల్ లో ఆడపిల్లలు బహిష్టు అయ్యారో లేదో తెలుసుకోవడానికి లో దుస్తులు కూడా విప్పించి పరీక్షించిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో దారుణం జరిగింది. ఇది అంత కన్నా దారుణ సంఘటన కావడం అందరిని ఆశ్చర్య పరుస్తున్నది. ఒక ఆసుపత్రిలో మహిళా క్లర్కులను ఎంపిక చేయడానికి వారి బట్టలు విప్పించి పరీక్షించారు.
సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ లో ఈ దారుణం జరిగింది. యువతులను బట్టలు విప్పి పరీక్షలు జరిపారని బయటి ప్రపంచానికి తెలియడంతో నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో సూరత్ మునిసిపల్ కమిషనర్ ఈ సంఘటనపై దర్యాప్తు నకు ఆదేశించారు. పెళ్లి కాని అమ్మాయిలను కూడా గర్భవతులా కాదా అని పరీక్షించడం దారుణమైన అంశమని సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపించింది. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.