ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై తెలంగాణ రైతాంగ వీరుడు, తెలంగాణ అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారని, దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారని అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని మంత్రి పేర్కొన్నారు.