ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి కమలారాణి కరోనా వైరస్ సోకడంతో మరణించారు. కమలారాణి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె వయసు 62 సంవత్సరాలు. కరోనా పాజిటీవ్ రావడంతో ఆమెను లక్నో లోని రాజధాని ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు.
గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం మరణించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఎక్కువ కావడంతో ఆమె శ్వాస అందక మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమెకు అత్యుత్తమ చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని డాక్టర్ రాధా కృష్ణ ధీమాన్ తెలిపారు.