కరోనాను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలన్న విధంగా కాకుండా యువతే ఓ అడుగు వేయాలని ఏపీలో ఉత్తరాంధ్ర రేంజ్ డీఐజీ రంగారావు ఓ సందేశం ఇచ్చారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం పరంగా తీసుకుంటున్న చర్యలన్నీ తీసుకుంటున్నా…కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఇక పల్లె సీమలే ప్రగతికి పట్టుకొమ్మలు . అలాగే ప్రస్తుతం పెరుగుతున్న కరోనా ను అరికట్టేందుకు గ్రామీణ యువతే నడుంబిగించాలని రేంజ్ డీఐజీలో పిలుపు నిచ్చారు.పెరుగుతున్న కేసులు దృష్ట్యా కర్ప్యూ విధించిన సమయంలో ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని..అటు గ్రామీణ ప్రాంతాలలోనూ ఇటు పట్టణ..నగర ప్రాంతాలలో ఉరకలు వేసే యువతే అందరికీ చేయూత గా నిలవాలన్నారు. పది మందిలో కేవలం ఇద్దరు,ముగ్గురు మాత్రమే ముందడగు వేసి..తమ ప్రాంత వాసులకు వార్డు ప్రజలకు, నిత్యావసర సరుకులు అందించేందుకు ముందడగు వేయాలని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు పిలుపు నిచ్చారు. సో ఉక్కు నరాలు…ఇనుప కండరాలు కలిగే యువతే దేశానికి ఆదర్శం అన్న స్వామి వివేకానందుని మాటలను…డీఐజీ చెప్పినట్టుగా చేయాలని కోరుతోంది….సత్యంన్యూస్.నెట్.