నెల్లూరు సిటీ పరిధిలోని 15వ డివిజన్ బాలాజీ నగర్ మస్జీద్ సెంటర్ లో సంక్రాంతి సందర్భంగా వై.ఎస్.ఆర్ సి పి మైనార్టీ అధ్యక్షులు షేక్ షమీమ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పోటీలకు హాజరై రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి వై ఎస్ ఆర్.సి.పి యువ నేత ఆనం రంగమయూర్ రెడ్డి, షేక్ ఖాజావలి మాజీ నుడా డైరెక్టర్, డివిజన్ కార్పొరేటర్ గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి,
దేవరాల సుబ్రహ్మణ్యం మాజీ మార్కెటింగ్ చైర్మన్,సువర్ణ కుమారి సుగుణమ్మ,ఆలియా, సమాధి శ్రీనివాస యాదవ్ బిసి జిల్లా అధ్యక్షులు హాజరై గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా విశ్వంభరా ట్రస్ట్ వారి క్యాలెండర్ ఆవిష్కరించారు.