వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా పట్టణం లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.స్వామి వారి కల్యాణ మండపంలో ఈ.ఓ కృష్ణవేణి స్థానాచార్యులు అప్పల భీమశంకర శర్మ ఎమ్మెల్యేకు వేదోక్త ఆశీర్వచనాన్ని ఇచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
వారి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు జెమిని శ్రీనివాసరావు, నరాల శేఖర్, మాజీ కౌన్సిలర్లు, తెరాస నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.ఆ తరువాత వివిధ వార్గల నేతలు,అధికారులు,ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనకు అయన స్వగృహం సంగీత నిలయానికి వెళ్లి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఆయనకు తెరాస పార్టీ అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపగా ,నిన్ననే ముఖ్య మంత్రి కెసిఆర్ ఆశీర్వాదం ఆయన తీసుకున్నారు.