పవిత్ర ఆరాధనకు , ధార్మిక చింతనకు, దైవభక్తికి, క్రమశిక్షణకు , దాతృత్వానికి ప్రతీక రంజాన్ అని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్లాం అనుసరించే వారికి ఆధ్యాత్మిక, సామాజిక, వ్యక్తిగత, న్యాయ ధర్మ శిక్షలన్నింటికీ ఆధారం పవిత్ర ఖురాన్ అని అన్నారు. ఇఫ్తార్ విందులో ఆత్మీయత, సహృద్భావాలు వెల్లి విరుస్తాయని.. పరస్పర ధోరణికి, విశాల ఆలోచన దృక్పథానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైనా ఉండాలని ఆకాంక్షించారు.
previous post
next post