37.7 C
Hyderabad
May 4, 2024 11: 32 AM
Slider కరీంనగర్

గణేష్ పండుగ ఆంక్షలపై విహెచ్ పి, బి జె పి నిరసన

#BJPKarimnagar

హిందూ పండుగలపై తెలంగాణ రాష్ట్రంలో అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఉదయం అంబేద్కర్ చౌరస్తా వద్ద విశ్వహిందూ పరిషత్, భాజపాలో సంయుక్తంగా నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపాయి.

ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోర్ రావు, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తున్నదని ఒక వర్గం వారికి అనుకూలంగా కెసిఆర్ పాలన సాగిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.

నిబంధనల పేరుతో హిందూ పండుగలు నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ అక్రమ కేసులు బనాయించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వైఖరిని ప్రభుత్వ పెద్దలు మానుకోకపోతే హిందూ శక్తులు ఏకమై సంఘటితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  రేగుల సంతోష్ బాబు ,చిలుకల గట్టు కలికోట నవీన్, గోపాల్ నామాల శేఖర్ ,ఆంజనేయులు తదితరులు  విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆర్ఎస్ఎస్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలు: భక్తుల ఆగ్రహం

Satyam NEWS

ఉత్సాహంగా సీఎం సభకు వెళ్లిన ఉప్పల్ గులాబీ శ్రేణులు

Satyam NEWS

బస్తీ ప్రజల బాధలు తీర్చేందుకు కార్పొరేటర్ పర్యటన

Satyam NEWS

Leave a Comment