కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల సూరవరపు వారి వీధి మంగళవారం రాత్రి అమ్మవారి జాతర లో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాల స్టేజ్ ని ఏర్పాటు చేసి అశ్లీల నృత్యాలను నిర్వహించడం భక్తుల్ని కలతకు గురి చేసింది.
పోలీస్ శాఖ వారు సైతం దీన్ని పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇక్కడికి సమీపంలోనే పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ నివాసం ఉన్నది. అయినా పట్టించుకోకపోవడంపై భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. జాతరలో డ్యూటీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సైతం స్పందించకపోవడం చాలా వింతగా ఉంది. ప్రలోభాలకు లోబడి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారని పలువురు ఆరోపిస్తున్నారు.