40.2 C
Hyderabad
May 6, 2024 16: 05 PM
Slider గుంటూరు

ఎరువుల షాపులపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ దాడులు

vigelence raids

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు నేడు  పెద్ద ఎత్తునే దాడులు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ లోని విష్ణు ప్రియాంక రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమతులు లేని బయో ఉత్పత్తులు, పురుగు మందులు, కాలం చెల్లిన పురుగు మందులను గుర్తించినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4,10,950 విలువ చేసే మందులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇంకా గోడౌన్ తనిఖీ చేయాల్సి ఉందని తెలిపారు. కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఏ డి ఎ మస్తానమ్మ, ఏ ఒ వాసంతి, విజిలెన్స్  సి.ఇ భాష, సునీల్ కుమార్, డి డి ఎ రామాంజనేయులు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

సౌమ్యనాధ బ్రహ్మోత్సవాలల్లో ధ్వజారోహణం

Satyam NEWS

11 నుంచి శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలు

Sub Editor

స్పెషల్: టీటీడీ ఈవోగా జె ఎస్ వి ప్రసాద్ కు గ్రీన్ సిగ్నల్?

Satyam NEWS

Leave a Comment