42.2 C
Hyderabad
May 3, 2024 18: 59 PM
Slider కడప

కడప నగరంలో పులివెందుల వాసులమని దౌర్జన్యం

pulivendula

పులివెందుల వాసులమని చెప్పి బెదిరించి రోడ్డును, రోడ్డు పక్కన ఉన్న ప్రయివేటు వ్యక్తుల స్థలాన్ని కొందరు కబ్జా చేయడం దారుణమైన విషయమని సిపిఐ కడప నగర కార్యదర్శి యన్. వెంకట శివ అన్నారు. కడప నగరం లోని పూసల వీధి చివరన వున్న ముగ్గు రాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర గల మునిసిపల్ కార్పొరేషన్ గ్రావెల్ రోడ్డు ను పులివెందుల వాసులమంటు కొంతమంది  జెసిబి తో పెకలించారని ఆయన అన్నారు.

ఏళ్ళ తరబడి ఆ ఏకైక రహదారి లో రాకపోకలు సాగిస్తున్న వారికి ఇబ్బంది కలిగించడం శోచనీయమని ఆయన అన్నారు. అదేమని అడిగిన 15 కుటుంబాల వారిపై బెదిరింపులకు, దౌర్జన్యానికి ఆ పులివెందుల నాయకులు దిగారని వెంకట శివ తెలిపారు.

రహాదారి ప్రక్కన గల 20 సెంట్ల స్థలం ను తాము కొన్నామని, దారి సైతం తమ పరిధి లో వుందని, డాక్యుమెంట్ ల తో మీకు అవసరం లేదు అంటూ ఎటు వంటి పత్రాలు చూపించకుండనే  మంది మార్బలంతో దందా చేస్తున్నారని బాధితులు అంటున్నారు. మునిసిల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసు వారు తమకు న్యాయం చేయాలని అక్కడి నివాసి జయరామ్ కోరుతున్నారు.

Related posts

వెల్ కం: ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ప్రారంభం

Satyam NEWS

డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్పుకు చర్యలు

Bhavani

కంప్లయింట్: ఇప్పటికి ఏపి బిజెపికి సెగ తగిలింది

Satyam NEWS

Leave a Comment