అయనో అధికారి పార్టీ ఎమ్మెల్యే..అంతేనా… పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కూడా. అదీకాకుండా వైఎస్ఆర్సీపీలో కీలక నేత. తనతో పాటు జిల్లాలోని దాదాపు అన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మంత్రి బొత్స సత్యనారాయణకు సమానంగా ఎదిగిన ఎమ్మెల్యే. అదీ కాకుండా మొన్నజరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో ప్రతి పక్ష పార్టీ అడ్రస్ ను గల్లంతు చేసి వైఎస్ఆర్సీపీ సత్తా ద్వారా తానేంటో పార్టీ అధ్యక్షుడుకి చూపించిన ఎమ్మెల్యే.ఆయనే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. అపార అనుభవం ఉన్న ఎమ్మెల్యే నోటి వెంట ఓ మాట జారింది. విజయనగరం అధికారికంగా కార్పొరేషన్ గా ప్రకటించినప్పటికీ…ఇంకా ఆ స్తాయికి చేరుకోలేదంట. ఆ స్థాయికి చేరుకోవాలంటే… కార్పొరేషన్ అభివృద్దిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే కోలగట్ల అన్నారు. జగనన్న పచ్చ తోరణంలో భాగంగా దుప్పాడలోని అయ్యన్నకోరు చుట్టు పక్కల దాదాపు 20 కొబ్బరి మొక్కలను నాటారు.ఈ సందర్భంగా కోనేరు చుట్టు ఉన్న ప్రదేశాన్ని ఎమ్మెల్యే కాలి నడకన పరిశీలించారు. కోనేరు పక్కనే పోలీస్ ట్రైనింగ్ పలు ఆటలలో కొచింగ్ తీసుకుంటున్న పలువురు క్రీడాకారులు ఎమ్మెల్యే కోలగట్లను కలిసారు.వారింతో జిల్లా స్థాయిలో గొల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారణి ఒకరు ఉన్నారు.అలాగే ఇటీవలే జరిగిన నేషనల్ గేమ్స్ లో పాల్గొన్న క్రీడాకారులు కూడా ఎమ్మెల్యేను కలిసారు.అనంతరం ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ…నగరంలోని పార్క్ లు, కోనేరు,చెరువుల అభివృద్దికి స్థానిక కాలనీ కమిటీలు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్తానిక డివిజన్ కార్పొరేటర్లు, ప్రముఖ డాక్టర్ ప్రసాద్, కాలనీ సభ్యులు, పలువురు పాల్గొన్నారు.
previous post