విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారీ… పూసపాటిరేగ,కొప్పెర్లకు వెళ్లారు. ముందుగా అక్కడ కొత్తగా నిర్మంచి ప్రభుత్వ భవనాలను పరిశీలించిన కలెక్టర్..అక్కడ ఉంచీ టెన్త్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసారు. ఇక ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే…పాతకొప్పెర్లలోని అంగన్ వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిష్టర్లను పరిశీలించారు. పిల్లల ఎత్తు, బరువును కొలిపించి, స్వయంగా తనిఖీ చేశారు. పిల్లల అవగాహనా స్థాయిని తెలుసుకున్నారు.
చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అంగన్వాడీ కార్యకర్త కనకరత్నం, సహాయకురాలు ముత్యాలు వివరించారు. ఈ కేంద్రం పరిధిలో మొత్తం 10 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి ఇవ్వాల్సిన పోషకాహారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని వారు చెప్పారు. అంగన్వాడీ భవనం చాలా ఇరుకుగా ఉన్నందున, కొత్త భవనం నిర్మాణానికి దాతల సహకారాన్ని తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొత్త భవనం నిర్మాణానికి తగిన స్థలాన్ని సేకరించాలని, పూసపాటిరేగ తహశీల్దార్ కృష్ణమూర్తిని ఆదేశించారు.
జరజాపుపేట లో జగనన్న కాలనీ సందర్శన….!
పొద్దున్నే…జిల్లాకు తూర్పు దిశగా ఉన్న పూసపాటిరేగ, కొప్పెర్లకు వెళ్లిన కలెక్టర్ సూర్యకుమారీ…అక్కడ నుంచీ నెల్లిమర్ల మండలం జరజాపుపేట హౌసింగ్ కాలనీని పరిశీలించారు. అలాగే అక్కడి సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రాధమిక ఆరోగ్యం కేంద్రం భవనాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాలనీలోని బోరుకు మోటార్ను బిగించి, సాయంత్రానికి నీటి సదుపాయం కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.
ఇంకా ప్రారంభించని 8 ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఆలస్యం చేస్తే ఇళ్లను రద్దుచేయడం జరుగుతుందని చెప్పారు. కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని, ఇళ్ల నిర్మాణం మొదలు కాకపోతే, ఇంజనీరింగ్ అసిస్టెంట్లపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో తాశీల్దార్ రమణరాజు, హౌసింగ్ డిఇ మురళి, ఏఈ రమణరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.