30.7 C
Hyderabad
April 29, 2024 04: 47 AM
Slider ప్రత్యేకం

మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ

#dkaruna

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో జరిగిన  క్రెడెయ్ సమావేశంలో మంత్రి కేటీఅర్ మాట్లాడుతూ , ఆంధ్ర లో ఉన్న తన మిత్రుడు తెలంగాణ వారిని బస్సులో ఆంధ్రకు తీసుకొని వచ్చి, అక్కడ రోడ్లు, విద్యుత్ సరఫరా ఎంత అధ్వానంగా ఉందో  చూపించాలని కోరినట్లు మంత్రి తన ప్రసంగంలో వ్యాఖ్యానించడం పై డీకే అరుణ స్పందించారు.

కేటీఆర్ తన మిత్రుడు ఎవరో చెప్తే, తాను స్వయంగా అతడిని గద్వాల తో పాటు రాష్ట్రంలో  ఉన్న అన్ని జిల్లాలకు  తీసుకొని వెళ్ళి, అక్కడ రోడ్లు, నీటి, విద్యుత్ సరఫరా ఎంత ఘోరంగా ఉన్నాయో చూపిస్తానని, కేటీఅర్ స్నేహితుడు కేవలం కల్వంకుంట్ల వారి ఫార్మ్ హౌస్ చుట్టుప్రక్కల ప్రాంతాలు చూసి , మొత్తం రాష్ట్రం అంతా అదే విధంగా ఉంటుందన్న బ్రమలో ఉన్నటున్నారని డీకే అరుణ ఎద్దేవా చేసారు. దానికి తోడు కేటీఅర్ సొంత డబ్బా కొట్టుకోవడంలో  సిద్ధహస్తుడన్న విషయం యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసన్న విషయం  కేటీఅర్ మర్చినట్టు ఉన్నారని డీకే అరుణ చురకలు అంటించారు. 

Related posts

జర్నలిస్టులపై దాడులు అమానుషం

Satyam NEWS

డాక్టర్ సుధాకర్ ఈ సమాజాన్ని క్షమించు

Satyam NEWS

కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ చింతలపల్లికే..

Satyam NEWS

Leave a Comment