26.7 C
Hyderabad
May 3, 2024 07: 23 AM
Slider విజయనగరం

క‌రోనా నివార‌ణ‌కు న‌గ‌రంలో మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్ ర్యాలీ….!

#vijayanagaram

కరోనా మ‌హ‌మ్మారి రోజురోజుకీ పెరుగుతోంది. ప్ర‌త్యేకించి ఫంక్ష‌న్లు,స‌మావేశాలు జ‌రిగిన‌త‌ర్వాత వైర‌స్ వ్యాప్తిచెందుతోంది.ప‌ర్య‌వ‌న‌స‌నంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి.రెండు రోజుల‌క్రితమే  క‌రోనా కేసులు వెయ్యి దాటాయంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.  ఈ పరిస్థితుల‌లోనే  న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను  అప్ర‌మ‌త్తం చేసేంద‌కు మున్సిప‌ల్ కార్పొరేష‌న్  కంక‌ణం క‌ట్టుకుంది. ఈ మేర‌కు  న‌గ‌ర మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ,డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణిలు న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను క‌రోనా ప‌ట్ల అప్ర‌మ‌త్తం చేసుందుకు ఉద్యుక్తులై….ర్యాలీ చేప‌ట్టారు.గంట‌స్థంభం నుంచీ  మూడు లాంత‌ర్ల వ‌ర‌కు  జ‌రిగిన ఈ ర్యాలీలో ప్ర‌తీఒక్క‌రూ మాస్క్ లు పెట్టుకోవాల‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ఇచ్చిన  వాహ‌నం దిగి మరీ..మేయ‌ర్,డిప్యూటీమేయ‌ర్లు  న‌డుచుకుని మరీ….ప్ర‌తీ షాపులో వెళ్లి….అక్క‌డి వ‌ర్త‌కుల‌తోపాటు కొనుగోలు దారుల‌కు కూడా మాస్క్ లు పెట్టుకోవాల‌ని…సామూహికంగా క‌రోనాను నిర్మూలిద్దామ‌ని కోరారు.మేయ‌ర్ తో పాటు క‌మీష‌న‌ర్ వ‌ర్మ‌,హెల్త ఆఫీస‌ర్ త‌దిత‌రులంతా  ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Related posts

అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

అత్యాచారానికి గురై ఆపై గర్భందాల్చిన మైనర్ బాలిక

Satyam NEWS

ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమగా రూపొందాలి

Satyam NEWS

Leave a Comment