40.2 C
Hyderabad
April 29, 2024 15: 47 PM
Slider నల్గొండ

కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలి:ఐఎన్ టియుసి

#intuc

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల పరిధిలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్నా కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలని ఐ ఎన్ టి యు సి హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య కోరారు. 

గోపాలపురం గ్రామంలో ఐ ఎన్ టి యు సి అనుబంధ హుజుర్ నగర్ ప్రాంత ఇటుక వర్కర్స్ యూనియన్ సమావేశంలో గురవయ్య మాట్లాడుతూ ఇటుక బట్టిలలో పనిచేస్తున్న కార్మికులకు మాస్క్ లు,శానిటైజర్లు అందజేయలని,కార్మికులకు ఆరోగ్యభద్రత కల్పించాలని ఇటుక బట్టిల యజమానులను కోరారు. 

కార్మికులకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు నష్టపోకుండా కార్మిక సంక్షేమ మండలిలో భీమా సౌకర్యం కల్పించాలని,అందుకు అయ్యె ఖర్చు యాజమాన్యమే భరాయించాలని అన్నారు.కరోనా ఉదృతం అవుతున్న సమయంలో కార్మికులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు తప్పనిసరిగా మాస్క్ లు,శానిటైజరు వాడలని అవే మనకు శ్రీరామరక్ష అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో చల్ల నాగేశ్వరరావు, పన్నిరు గోపాలరావు,కాసర్ల లక్ష్మీ,గుంజ సుభద్ర,సింగం లక్ష్మి,గుంజ రమణ, పందిపోటు విజయ,సుజాత,ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నరసరావుపేట ఆర్టీసీ డిపోలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు

Satyam NEWS

ప్రాబ్లెమ్:పాపాను ముట్టుకుంటేనే చర్మం ఊడుతుంది

Satyam NEWS

తెలుగుదేశంలో తొంగి చూస్తున్న ఉత్సాహం

Bhavani

Leave a Comment