విజయనగరం పోలీస్ సిబ్బందికి హేట్సాప్ చెబుతున్న “సత్యం న్యూస్.నెట్ “
రోడ్ ప్రమాదాలు తరచూ జరగడంతో వాటిని నివారించే పనిలో భాగంగా ఏపీలోని విజయనగరం జిల్లా పోలీసులు చర్యలు ప్రారంభించారు. పోలీస్ బాస్ దీపికా ఆదేశాలతో…కొన్ని జాగ్రత్తలతో పాటు…రోడ్డ ప్రమాదాలను అరికట్టేందకు గల కారణాలను అన్వేషించడంతో పాటు జరగకుండా ఉండేందుకు..ఇతర శాఖలతో కలిసి పనిచేయడంప్రారంభించారు.
రోడ్ ప్రమాదాలు జరగకుండా..ప్రదానంగా… ఒకటి వాహనాలను నిబందనలకు విరుద్దంగా నడపడం….వాహన వేగాన్ని నియంత్రించడం…పరిమితికిమించి వాహనాలపై ప్రయాణించడం వాటిపై వాటిప దృష్టి పెట్టారు… పోలీస్ బాస్..ఆయా స్టేషన్ల హౌస్ ఆఫీసర్లతో పాటు ట్రాఫిక్ విభాగపు సిబ్బందిని కూడా ఎక్కడిక్కడ వాహనాలను నిలుపుదల చేసి..చైతన్య పరచడం..అవసరమైతే జరీమానాలు విధించడం వంటి పనులను….ఎస్పీ దీపిక ఆదేశాల అనుసారం సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
ప్రధానంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించుటలో వాటికి గల కారణాలను కూడా పోలీసులు అన్వేషించారు. ఇందులో భాగంగా ప్రమాదాలు జరగుతున్న రోడ్డులలో ఇంజనీరింగు లోపాలను సరి చేయుట, ప్రజల ను ఎడ్యుకేట్ చేయుడం, నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయడం, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రికాషనరీ బోర్డులను, స్టాపర్లును ఏర్పాటు చేసే చర్యలను నిరంతరం చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసు శాఖ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టి, రికార్డులు పరిశీలించి, ఎం.వి. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు ఈ-చలనాలను విధించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ మేరకు కొన్ని కొన్ని చోట్ల పోలీసు సిబ్బందే పంచాయితీ రాజ్ శాఖతో మాట్లడి ఏకంగా రోడ్ ప్రమాదాలు జరిగే చోట…గుంతలున్న ప్రాంతాలను గుర్తించి ఏకంగా వాటిని పూడ్చే చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గజపతినగరం లో చిన్న చిన్న సెల్ఫ్ ఆక్సిడెంట్స్ జరుగుతున్న పోలీస్ స్టేషన్ ఎదురుగా అలాఈగే మెంటడా రోడ్ జుంక్షన్ వద్ద ఉన్న గుంతలను హైవే కాంట్రాక్టర్లు వారు సహాయం తో స్వయంగా మరమ్మత్తులు చేసే చర్యలకు దిగారు…పోలీసులు….శాఖా సిబ్బందికి హేట్సాప్ చెబుతో్ంది….సత్యం న్యూస్.నెట్.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం