వచ్చే నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు అటు రెవెన్యూ, ఇటు పోలీసు శాఖ… పోలింగ్ నిర్వహణపై సమాయత్తం అవుతున్నారు.
ఇందులో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో పోలీసులు ప్లాగ్ మార్చ్..నాకాబందీ, కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఆదేశాలతో నగర పోలీసులు నాకా బంధీ నిర్వహించారు. వన్ టౌన్ ,టూటౌన్ పోలీసులు నగర పరిధిలో అన.ని చోట్ల నాకాబందీ నిర్వహించారు. రోడ్లపై వెళుతున్న వాహనదారుల వివరాలను సేకరించారు.
నగరంలో ని దుప్పాడ, అయ్యన్నపేట ,పూల్ భాగ్ ,కేఎల్.పురం ,ధర్మపురి ,పద్మావతీ నగర్ ,డబుల్ కాలనీ వంటి ప్రాంతాల్లో సీఐలు మురళీ ,శ్రీనివాసరావు లు తన సిబ్బంది అయిన ఐడీ పార్టీ ,స్నైపర్ ,లా అండ్ ఆర్డర్ సిబ్బంది తో నాకాబందీ నిర్వహించారు.
వచ్చే నెల 10న విజయనగరం కార్పొరేషన్ తో పాటు నెల్లిమర్ల, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం ,పట్టణిలలో ఆయా స్టేషన్ సిబ్బంది నాకాబందీ నిర్వహించారు.