విజయనగరం జిల్లా కేంద్రంలో టూటౌన్ స్టేషన్ కు కొత్తగా మూడు అంతస్తుల భవనం రూపుదిద్దుకుంటోంది.
గత ఆరు నె లల వరకు సంబంధించిన కాంట్రాక్టర్ కు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచీ రావాల్సిన బకాయిలను కొత్త గా వచ్చిన డీఎస్పీ అనిల్ దగ్గరుండీ సగం మొత్తం వచ్చేలా చూసారు.
అయితే కొత్తగా జిల్లాకు ఎస్పీగా దీపికా పాటిల్ రావడం..బకాయిల విషయం చెప్పడంతో హుటాహటిన కొత్త స్టేషన్ భవనాన్ని పరిశీలించేందుకు ఎస్పీ దీపికా పాటిల్ వచ్చారు.
ఆమె వెంట డీఎస్పీ అనిల్, టూటౌన్ సీఐ లక్ష్మణరావు లు కూడా ఉన్నారు.
మూడు అంతస్థుల భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ నిర్మాణ వివరాలు తెలుసుకొని, పోలీసు హౌసింగ్ బోర్డు సిబ్బందికి పలు సూచనలు చేసారు.
మూడొంతులు వచ్చేనెలలో స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం.