విజయనగరం జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ దీపికా పాటిల్…తానేంటో సిబ్బందికి తెలియచెప్పే పనిలో పడ్డారు.ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ ను తనిఖీలు చేసి తద్వారా వారు నిర్వహిస్తున్న విదుల ద్వారా పరిచయం చేసుకుంటున్న ఎస్పీ…తాజాగా సచివాలయాలపై దృష్టి సారించారు.ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ చర్చ్ ప్రాంతం మరియు…బీసీ కాలనీ లో ఉన్న వార్డు సచివాలయాలను ఎస్పీ దీపికా పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.
దాదాపు రెండు గంటకుపైగా సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న రెవిన్యూ సిబ్బందితో చర్చించారు.అలాగే పోలీస్ శాఖ తరుపున మహిళా సంరక్షక పోలీసులు నిర్వహిస్తున్నవిధులను కూలంకుషంగా తెలుసుకునే యత్నం చేసారు.ముందుగా కంటోన్మెంట్ చర్చి ప్రాంతంలో ఉన్న 49వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు..,సచివాలయ కార్యదర్శిలో దాదాపు గంటకు పైగా చర్చించారు. ఆ సమయంలోనే డివిజన్ కార్పొరేటర్ కూడా వచ్చిన సచివాలయ నిర్వహణ సిబ్బంది పనితనాన్ని గురించి ఎస్పీ కి వివరించారు.
అసలు సచివాలయ వ్యవస్థ ఏ విధంగా పని చేస్తోందన్నది…రెవిన్యూ సిబ్బంది తో పాటు పోలీస్ శాఖ కూడా పరిశీలించాలని ఇటీవలే సీఎం జగన్…పోలీస్ బాస్ కు ఆదేశించారు కూడ.. ఈ నేపద్యంలోనే రాష్ట్ర పోలీస్ బాస్ నుంచీ వచ్చిన సమాచారం మేరకు…అన్ని జిల్లాల్లో వార్డు,గ్రామ సచివాలయాలను తనిఖీ చేసే యత్నం ప్రారంభించారు..జిల్లా పోలీస్ బాస్ లు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ దీపికా పాటిల్…నగరంలోని రెండు డివిజన్ లలో ఉన్న వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు.
ఈ సందర్బంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ….వార్డు సచివాలయపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రావడం జరిగిందన్నారు. అసలు సచివాలయాలు ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తున్నదో అధ్యయనం చేసేందుకు వచ్చామన్నారు.ఈ పర్యటనలో విజయనగరం డీఎస్పీ అనిల్, వన్ టౌన్ సీఐ మురళీ, ట్రాఫిక్ ఏఎస్ఐ నూకరాజు,పోలీస్ శాఖ ఫోటోగ్రాఫర్ కృష్ణ, పీఆర్ఓ కోటేశ్వరరావులు పాల్గొన్నారు.